ఇంజనీర్ల సంఘాల డైరీని ఆవిష్కరించిన ఉత్తమ్

ఇంజనీర్ల సంఘాల డైరీని ఆవిష్కరించిన ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: నీటిపారుదల రంగం మరింత బలోపేతమయ్యేలా ఇంజినీర్లు పని చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (ఏఈఈలు) పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 

గురువారం సెక్రటేరియెట్‌లో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సంఘం రూపొందించిన క్యాలెండర్, డైరీలను మంత్రి ఆవిష్కరించారు.