నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) నెటిజన్స్ పై మండిపడ్డారు. ఇటీవల తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన ఆమె.. మాకు చెప్పడం, మాపై కామెంట్స్ చేయడం కాదు ముందు మీరు చేయండి అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ శబరి. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎందుకు ఎప్పుడు సెలబ్రెటీల గురించి కామెంట్స్ చేస్తారు. ఆలా చేశారు, ఇలా చేయలేదు అని. మా గురించి కంటే ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఒక స్టార్ ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే.. దాని వెనుక ఎన్ని కష్టాలో ఉంటాయో మీకు తెలియదు. సింపుల్ గా కామెంట్స్ చేస్తారు.. అంటూ ఫైర్ అయ్యారు వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.