ఇదొక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్

ఇదొక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్

తెలుగు, తమిళం అనే తేడా లేకుండా బిజీబిజీగా ఉంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఒకేసారి ఎనిమిది చిత్రాల్లో నటిస్తోంది.  స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. కొన్ని  చిత్రాల్లో లీడ్ రోల్స్‌‌‌‌ కూడా చేస్తోంది. వాటిలో ‘శబరి’  ఒకటి. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో కె.మహేంద్రనాథ్ నిర్మిస్తున్న ఈ సినిమా మొత్తం వరలక్ష్మి చుట్టూనే తిరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. రీసెంట్‌‌‌‌గా కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్.  కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లి పాత్ర చేస్తోంది వరలక్ష్మి. కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరిగా పోరాడుతుంది’ అని చెప్పాడు దర్శకుడు. వరలక్ష్మి మాట్లాడుతూ ‘ఇంత మంచి ప్రాజెక్ట్‌‌‌‌లో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. తల్లి పాత్ర నాది. నువేక్ష అనే చిన్నారి నా కూతురిగా నటించింది. మైమ్ గోపితో నాకిది నాలుగో సినిమా. ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తానా అని ఎదురుచూస్తున్నా’ అంది. త్వరలో విశాఖ షెడ్యూల్ ప్రారంభించనున్నట్టు నిర్మాత చెప్పారు. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.