
స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. మయోసైటిస్తో బాధపడుతూ ఇంటికే పరిమితమైన ఆమె చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. తన కొత్త సినిమా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసింది. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా... తన సినిమా కోసం బలం కూడగట్టుకుని ఈ కార్యక్రమానికి వచ్చానంటూ ఆమె చెప్పారు.
చాలారోజుల తర్వాత ఆమెను చూసిన అభిమానులు పొంగిపోయారు. ఇదే సమయంలో కొందరు ఆమె లుక్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశారు. ‘సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె అందం బాగా తగ్గిపోయింది. విడాకుల తర్వాత ఆమె కెరీర్లో ఉన్నతస్థానంలో ఉంటుందని భావిస్తుండగా.. మయోసైటిస్ ఆమెను మళ్లీ దెబ్బతీసింది. సామ్ను మళ్లీ బలహీనురాలిని చేసింది’ అంటూ ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్కు సామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తన లాగా కొన్ని మాసాల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదని గట్టిగా కోరుకుంటున్నానని చెప్పింది. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా కొంచెం పంపిస్తున్నా అంటూ ట్రోలర్స్కు సమంత కౌంటర్ ఇచ్చింది.
ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా సామ్కు అండగా నిలిచారు. సదరు నెటిజన్ ట్వీట్కు స్పందిస్తూ ‘మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్ బైట్స్ కోసమే ఆలోచిస్తారు. మీకు అందం కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సామ్ను కలవండి. తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది’ అని ధావన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సమంత, వరుణ్ ధావన్ కలిసి బాలీవుడ్లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో కలిసి నటిస్తున్నారు.