
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో దర్శకుడు వీర శంకర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్గా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి, ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ విజయం సాధించారు. జనరల్ సెక్రటరీలుగా మద్దినేని రమేష్, సుబ్బారెడ్డి, ట్రెజరర్గా పి.వి.రమణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో వీర శంకర్, సముద్ర ప్యానెల్ పోటీ పడ్డాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్గా ఎన్నికైన వీర శంకర్ మాట్లాడుతూ ‘టీఎఫ్డీఏను మరో స్థాయికి పెంచడానికి అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పటి వరకు చేసిన ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీల సలహాలను కూడా తీసుకుంటాం. టీఎఫ్డీఏ 2.0గా దీన్ని మారుస్తాం. ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం’ అని చెప్పారు.