సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నఆందోళనకారులు

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నఆందోళనకారులు

వేములవాడలో సీఎం కాన్వాయ్ ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం వాహనాలకు అడ్డువచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగిపడేశారు. ఆ తర్వాత.. జనాలకు అభివాదం చేస్తూ… సీఎం తన వాహనంలో ఆలయానికి వెళ్లిపోయారు.

సీఎం పర్యటనతో మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలుకూడా ఆందోళన నిర్వహించారు. సీఎం కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి రూట్ క్లియర్ చేశారు. నష్టపరిహారంపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు అక్కడే కూర్చుని నిరసన తెలుపుతున్నారు.