వేములవాడ రాజన్న భక్తులు పుకార్లు నమ్మొద్దు .. చర్యలు తీసుకోవాలని సీఐకి ఆలయ ఈవో ఫిర్యాదు

వేములవాడ రాజన్న భక్తులు పుకార్లు నమ్మొద్దు .. చర్యలు తీసుకోవాలని సీఐకి ఆలయ ఈవో ఫిర్యాదు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నారన్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ టౌన్​ సీఐ వీరప్రసాద్​కు రాజన్న ఆలయ ఈవో వినోద్​రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆలయ అభివృద్దిలో భాగంగా జూన్​ నెల 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు సోషల్​ మీడియాలో కొందరు వ్యక్తులు తప్పుడు లేఖను సృష్టించి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

 ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్న లేఖను తాము విడుదల చేయలేదని అన్నారు. ఇలాంటి లేఖలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఆయన కోరారు.