ఎములాడ రాజన్నకు భారీగా హుండీ ఆదాయం

ఎములాడ రాజన్నకు భారీగా హుండీ ఆదాయం

వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారికి భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఆలయ ఓపెన్​ స్లాబ్​లో బుధవారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, ఎస్పీఎఫ్​ పోలీసుల సమక్షంలో హుండీలను లెక్కించారు. 13 రోజుల్లో రూ. 1.44 కోట్లు,  బంగారం 107 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 7 .900 కిలోలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  

హుండీ లెక్కింపును  ఆలయ ఈఓ వినోద్​ రెడ్డి పర్యవేక్షించారు. శివరామకృష్ణ భజన మండలి, ఆలయ ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారు.  ఈ మధ్య కాలంలో రాజన్న ఆలయం అభివృద్ధి పేరుతో మూసివేస్తారని వ్రచారంతో  రాజరాజేశ్వర స్వామి వారికి సన్నిధికి భక్తులు వచ్చే సంఖ్య పెరిగింది.