
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారికి భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఆలయ ఓపెన్ స్లాబ్లో బుధవారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, ఎస్పీఎఫ్ పోలీసుల సమక్షంలో హుండీలను లెక్కించారు. 13 రోజుల్లో రూ. 1.44 కోట్లు, బంగారం 107 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 7 .900 కిలోలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
హుండీ లెక్కింపును ఆలయ ఈఓ వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. శివరామకృష్ణ భజన మండలి, ఆలయ ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో రాజన్న ఆలయం అభివృద్ధి పేరుతో మూసివేస్తారని వ్రచారంతో రాజరాజేశ్వర స్వామి వారికి సన్నిధికి భక్తులు వచ్చే సంఖ్య పెరిగింది.