బాలీవుడు యాక్టర్ శివ్ సుబ్రహ్మణ్యం కన్నుమూత

బాలీవుడు యాక్టర్ శివ్ సుబ్రహ్మణ్యం కన్నుమూత

ముంబై: ప్రముఖ స్క్రిప్ట్ రైటర్, బాలీవుడ్ నీనియర్ నటుడు శివ్ సుబ్రహ్మణ్యం సోమవారం ముంబైలోని ఆయన సొంత నివాసంలో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడైన ప్రముఖ ఫిలిం మేకర్ అశోక్ పండిట్ తన ట్వట్టర్ లో పోస్ట్ చేశారు. ‘శివ సుబ్రహ్మణ్యం చనిపోయారనే విషయం తెలిసి షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని అశోక్ పండిట్ ట్వీట్ చేశారు.  

కాగా.. శివ్ సుబ్రహ్మణ్యం 1989లో రిలీజైన ‘పరీందా’,‘హజారోం ఖ్వైషీన్ ఐసీ’ సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా  పని చేశారు. ఈ సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. శివ్ సుబ్రహ్మణ్యం చాలా సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన ‘టూ స్టేట్స్’లో అలియా భట్ కు ఫాదర్ గా ఆయన నటించారు. ‘మీనాక్షి సుందరేశ్వర్’ ఆయన నటించిన చివరి సినిమా. శివ్ సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

షాంఘైలో ఆకలి కేకలు!