అత్యాచార నిందితుడికి బెయిల్.. పెట్రోల్ పోసుకున్న బాధితురాలు

అత్యాచార నిందితుడికి బెయిల్.. పెట్రోల్ పోసుకున్న బాధితురాలు

ఉన్నావో ఘటన మరువకముందే అదే ఉన్నావోలో మరో యువతి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో మనస్థాపం చెందిన యువతి పెట్రోల్ పోసుకొని కాల్చుకుంది. అది కూడా ఉన్నావోలోని పోలీసు సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు నిప్పంటించుకుంది. 70% కాలిన గాయాలతో ఉన్న ఆ యువతిని పోలీసులు వెంటనే కాన్పూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసుకు సంబంధించి ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, పెట్రోల్ పోసుకున్న యువతి గత కొంత కాలంలో రిలేషన్ షిప్‌లో ఉన్నారు. వారిద్దరూ గత 10 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. సదరు వ్య్తక్తి, యువతిని పెళ్లిచేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె అతడిపై 376 సెక్షన్ కింద కేసు పెట్టింది. కేసు విచారణలో ఉండగానే.. నిందితుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో మనస్థాపం చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. యువతి హసంగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందినది’ అని ఆయన తెలిపారు.