చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. ఆస్పత్రి ముందు ఆందోళన

చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. ఆస్పత్రి ముందు ఆందోళన

హైదరాబాద్:  చనిపోయిన వ్యక్తికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారని మృతుడి బంధువులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా సోలిపేటకి చెందిన సమ్మయ్యకు గుండెనొప్పి రావడంతో నిన్న ఉదయం 10 గంటలకు  హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని  ఓ కార్పొరేట్​ హాస్పిటల్ కు తీసుకొచ్చారు.  సమ్మయ్యకు ఈసీజీ చేసిన డాక్టర్లు గుండె సమస్య ఉందని చెప్పి జాయిన్ చేసుకున్నారు. అయితే రాత్రి సమ్మయ్య చనిపోయాడని కుటుంబసభ్యలకు హాస్పిటల్ సిబ్బంది చెప్పారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతో  సమ్మయ్య  చనిపోయాడంటూ అతని బంధువులు ఆందోళన చేశారు. దీంతో  హాస్పిటల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నడుచుకుంటూ హాస్పిటల్ కు వచ్చిన వ్యక్తిని చంపేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  రూ. 60 వేలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారని ఆరోపించారు.