న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ పోడియం ముందు బల్లలు ఎక్కి నినాదాలు చేయడం, పేపర్లు విసిరేయడంపై కేంద్ర మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల తీరు వల్లే సభ వాయిదా పడిందని విమర్శిస్తున్నారు. అయితే పార్లమెంట్ సెక్యూరిటీలో లేని బయటి వారిని తీసుకొచ్చి మార్షల్స్లో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికార, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష ఎంపీలు రచ్చ చేసిన వీడియో విడుదలైంది. చైర్మన్ పోడియం దగ్గరకు నేతలు చొచ్చుకురావడం, మహిళా ఎంపీలు మార్షల్స్తో గొడవకు దిగడం, పేపర్లు చించేసిన సీసీటీవీ ఫుటేజీని ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
#WATCH CCTV footage shows Opposition MPs jostling with marshals in Parliament yesterday pic.twitter.com/y7ufJOQGvT
— ANI (@ANI) August 12, 2021