వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ విజయ్శంకర్ ఔట్ అయ్యడు. ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తుండగా విజయ్ శంకర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి పీటీఐతో తెలిపారు. గాయం కారణంగా అతడు ప్రపంచకప్లో కొనసాగడం కష్టంగా ఉందని, ఇండియాకి తిరిగొస్తాడని అధికారి చెప్పారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్ మన్ మయాంక్ అగర్వాల్ ను టీమిండియా యాజమాన్యం సెలక్ట్ చేసిందని అన్నారు.
మయాంక్ అగర్వాల్ గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. దీంతో అతడి ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయ్ శంకర్ కి బదులు రిషభ్పంత్ ను ఆడించింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 31 పరగుల తేడాతో ఓటమిపాలైంది. తర్వాతి మ్యాచ్ మంగళవారం బంగ్లాదేశ్తో తలపడనుంది భారత్.