
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ఐటీఐ క్యాంపస్లో ఈ నెల26న ఉదయం 10:30 గంటలకు అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అప్రెంటిస్ షిప్ పోస్టులతో కలిపి 50కి పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మా, డీ-ఫార్మా, ఎం-ఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ను 9676047444 నంబర్లో సంప్రదించాలని కోరారు.