పిడుగుపాటుకు తల్లి, కొడుకు, కూతురు మృతి

పిడుగుపాటుకు తల్లి, కొడుకు, కూతురు మృతి

పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని దారూర్ మండలం రాజాపూర్ లో  ఈ దారుణం జరిగింది.  గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబం పొలం పనులు చేసుకుంటుండగా వారిపై పిడుగు పడింది.  పిడుగుపాటుకు తల్లి ఖాజాబీ, కూతురు తబస్సుమ్(16), కొడుకు అక్రమ్(12) చనిపోగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో స్ధానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వీళ్ళ సమీపంలో ఉన్న మేకలు కూడా పిడుగుపాటుకు చనిపోయాయి. పేద కుటుంబానికి చెందిన వీరి అకాల మరణంతో గ్రామంలో విషాద  ఛాయలు అలుముకున్నాయి.