బీసీల మధ్య ఎమ్మెల్యే జగ్గారెడ్డి చిచ్చుపెడుతున్నరు

బీసీల మధ్య ఎమ్మెల్యే జగ్గారెడ్డి చిచ్చుపెడుతున్నరు

ముషీరాబాద్, వెలుగు : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  రాజకీయంగా బీసీల మధ్య చిచ్చు పెడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగ్గారెడ్డి బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.

బుధవారం దోమలగూడలోని తన ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో విక్రమ్ గౌడ్ మాట్లాడారు. సంగారెడ్డిలో ఇద్దరు బీసీల మధ్యన చిచ్చుపెట్టి ఒక అగ్రకుల అభ్యర్థికి మేలు జరిగేలా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నీలం మధుకు సంగారెడ్డి సీటును జగ్గారెడ్డి త్యాగం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని పటాన్ చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్​కు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నేతలు కిరణ్, కృష్ణ, మహేశ్​తదితరులు పాల్గొన్నారు.