20 వేల స్క్రీన్స్‌‌తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్

20 వేల స్క్రీన్స్‌‌తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్

గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది ‘ట్వల్త్ ఫెయిల్’. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్‌‌ స్టోరీ ఆధారంగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. ఓటీటీలో విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి ఈ హిందీ చిత్రానికి మరింత ఆదరణ దక్కింది. ఇప్పుడీ సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారు.

 అదికూడా ఇరవై వేలకు పైగా స్క్రీన్స్‌‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుందట. హీరో విక్రాంత్ మాస్సే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలు చైనాలోనూ విడుదలై మెప్పించాయి. ముఖ్యంగా ఎమోషనల్ డ్రామాలను అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ‘ట్వల్త్ ఫెయిల్’ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ కోసం టీమ్ చైనా వెళ్లనుంది.