బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిలదీసిన గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిలదీసిన గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో  అడుగడుగునా  నిరసన సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.  ఇవాళ మహబూబాబాద్ జిల్లా మరిపెడ  మండలం రాంపురంలో పల్లెప్రగతి , పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న  ఎమ్మెల్యే రెడ్యానాయక్  ను స్థానికులు నిలదీశారు. 

నీళ్లు రావడం లేదని స్థానిక సర్పంచ్ ను, ఎంపీటీసీని  అడిగితే  పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.  డబుల్ బెడ్ రూమ్ లు తమ ఊరికి ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. తమ ఊళ్ళో నాయకులు ఎక్కువ పనులు తక్కువ ఉన్నాయన్నారు. ఓట్లు వేసేది  నాయకులు కాదని.. సామాన్య ప్రజలని ఎమ్మెల్యే తో వాగ్వాదానికి దిగారు. దీంతో  సమాధానము చెప్పలేక సభాప్రాంగణం  వెళ్లిపోయారు ఎమ్మెల్యే రెడ్యానాయక్.