
- టోలిచౌకిలో ఉంటున్న 28 మంది వివరాలు కేంద్రానికి పంపిన పోలీసులు
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలో అక్రమంగా నైజీరియన్లు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వారి వివరాలను పోలీసులు విదేశాంగ శాఖకు పంపించారు. శుక్రవారం టోలీచౌకి పారామౌంట్ కాలనీలో ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 300 ఇండ్లలో వారు సోదాలు నిర్వహించారు. 28 మంది విదేశీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. ఇందులో 16 మంది వీసా కాలం పూర్తయినట్లు డీసీపీ తెలిపారు.
25 బైక్లు, రెండు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విదేశీయుల విషయంలో విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.