మూడ్నెళ్లలోనే కేసీఆర్ ​దేవుడయ్యాడా? : విశారదన్​ మహారాజ్

మూడ్నెళ్లలోనే కేసీఆర్ ​దేవుడయ్యాడా? : విశారదన్​ మహారాజ్

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో చీకటి మిత్రులైన కేసీఆర్, ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ వెలుగులోకి వచ్చినట్లయిందని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ విమర్శించారు. ఇన్నాళ్లు కేసీఆర్ పై చేసిన యుద్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయిందన్నారు. పొత్తుతో అసలు రహస్యం బద్దలైందని, బహుజన వర్గాలకు స్పష్టత వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి మూడు నెలలు గడవక ముందే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు రాక్షసుడైన కేసీఆర్ దేవుడయ్యాడా అని ప్రశ్నించారు. బహుజన వర్గాల్లో స్వతంత్ర భావాలను ఎదగనీయకుండా, తీవ్ర ద్రోహం చేస్తున్న ప్రవీణ్ కుమార్ వైఖరిని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని విశారదన్​మహారాజ్​చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.