ఇకపై టీఆర్ఎస్ ఆటలు సాగవు

ఇకపై టీఆర్ఎస్ ఆటలు సాగవు

దేవరుప్పులలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి తీవ్రంగా ఖండించారు. పాదయాత్ర కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ గూండాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  సీఎం కేసీఆర్ కావాలనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ  బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

టీఆర్ఎస్ నాయకుల ఆటలు ఇక సాగవని..రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వివేక్ వెంటకస్వామి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారించే ఉద్దేశంతోనే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. మూడో విడత యాత్ర దిగ్విజయంగా సాగుతుండటంతో కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.