జార్ఖండ్‌లో ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌

జార్ఖండ్‌లో ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌

జార్ఖండ్‌లో  ఇవాళ( సోమవారం) నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,85,009 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  బరిలో ఉన్న వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. బొకారో స్థానం నుంచి అత్యధికంగా 25 మంది పోటీ పడుతున్నారు. సోమవారం  ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జమువా, బోగడర్, గిరిధ్, దుమ్రి, తుండి తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చివరి విడత ఎన్నికలు ఈ నెల 20న జరగనుండగా… 23న ఫలితాలు వెలువడనున్నాయి.