‘వాటర్ బెల్’ విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ వెనుకడుగు
అన్ని బడుల్లో వాటర్, టాయ్లెట్స్ సౌలత్ లేకపోవడమే కారణం
7,372 బడుల్లో మంచినీళ్లు కరువు
హైదరాబాద్, వెలుగు: పిల్లలు సాధ్యమైనన్ని ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు. కానీ రోజుకు సగటున నీళ్లు తగినన్ని తాగక స్టూడెంట్లు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన కేరళ.. ఆ రాష్ర్టంలోని బడుల్లో ప్రత్యేకంగా ‘వాటర్ బెల్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూల్ టైమింగ్స్లో ప్రతిరోజూ నాలుగు సార్లు బెల్ కొట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని విద్యావేత్తలతోపాటు స్టూడెంట్స్ యూనియన్లు కోరుతున్నాయి. కానీ వాటర్ బెల్ను అధికారికంగా కొట్టేందుకు స్కూల్ఎడ్యుకేషన్సిద్ధంగా లేదు. బడుల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
నీళ్లు, టాయిలెట్స్లేవు!
రాష్ర్టంలో అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో 40,597 బడులుండగా, వాటిలో 58,10,490 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. 26,050 ప్రభుత్వ స్కూళ్లలో 20 లక్షల మందికిపైగా స్టూడెంట్స్ఉన్నారు. ‘వాటర్ బెల్’ను తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని అన్ని బడుల్లో అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. తర్వాత అన్ని బడుల్లోనూ అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచ్చారు. ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్నట్టుగా బడుల్లో రోజూ మూడు, నాలుగు సార్లు వాటర్బెల్ కొట్టాలి. ఇంత వరకు బాగానే ఉన్నా.. అన్ని బడుల్లో తాగేందుకు నీళ్లున్నాయా? సరిపడా టాయిలెట్స్ ఉన్నాయా..? అంటే లేవు. దీంతో ఈ విధానం అమలుకు విద్యాశాఖ వెనుకంజ వేస్తోంది.
7,372 బడుల్లో తాగునీటి వసతి లేదు
బడుల్లో వసతులపై స్టడీ చేసేందుకు ప్రత్యేకంగా స్టూడెంట్ యూనిక్కార్డు పేరుతో ఓ మొబైల్ యాప్ను విద్యాశాఖ తీసుకొచ్చింది. మొత్తం బడుల్లో 23,620 స్కూళ్లు వివరాలు అందించాయి. వీటిలో 16,248 బడుల్లోనే తాగునీటి సౌకర్యం ఉందని తేలింది. మరో 7,372 బడుల్లో తాగునీటి వసతి లేదని వెల్లడైంది. చాలా బడుల్లో పిల్లలు ఇంటి నుంచి వాటర్ బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. అది కూడా మధ్యాహ్నం భోజనం కోసమే. దీంతో రూరల్ఏరియాల్లోని బడుల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులను, అర్బన్ ఏరియాల్లో మున్సిపల్ అధికారులను, జీహెచ్ఎంసీ ఏరియాలో హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులను సంప్రదించి, నీటి కనెక్షన్స్ తీసుకోవాలని హెడ్మాస్టర్లకు ఈ మధ్య స్కూల్ఎడ్యుకేషన్కమిషనర్ విజయ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ప్రైవేటు బడుల్లోనూ చాలా చోట్ల నీళ్లు లేవు.
ఇంటికి పోయాకే తాగేది..
రాష్ర్టంలో అన్ని బడుల్లో టాయ్లెట్స్ఉన్నట్టు అధికారులు చెప్తున్నా, స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా మాత్రం లేవు. ఉన్న బడుల్లోనూ నీటిసౌకర్యం లేక చాలా వరకు టాయిలెట్స్ నిరూపయోగంగా ఉంటున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే రాష్ర్టంలో అమ్మాయిలకు 2,972 టాయ్లెట్యూనిట్లు, అబ్బాయిలకు 6,251 టాయ్లెట్ యూనిట్స్ (మూడు యూరినల్స్, ఒక లెట్రిన్ ఉంటే టాయిలెట్ యూనిట్ అంటారు) అవసరం. టాయ్లెట్లు లేక చాలా చోట్ల స్టూడెంట్లు బడుల్లోకి వచ్చాకా అసలు నీళ్లే తాగరని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఇంటికి వెళ్లేదాకా అలానే ఉంటున్నారని చెబుతున్నాయి. ఇక టాయ్ లెట్స్ సౌకర్యంఉన్న స్కూళ్లలో స్టూడెంట్స్క్యూలైన్లు కట్టాల్సిన దుస్థితి. ఇలాంటి సమయంలో ‘వాటర్ బెల్’ కొడితే మరిన్ని సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే అన్ని బడుల్లో కలిపి అబ్బాయిలకు 11,451 టాయ్లెట్ యూనిట్లు, అమ్మాయిలకు 6,434 యూనిట్లు అవసరమని తేలింది.
మన దగ్గర కష్టమే
ఇతర రాష్ర్టాల్లో ఉన్న సౌకర్యాలకు, మన రాష్ర్టంలోని వసతులకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం బడుల్లో వాటర్, టాయ్లెట్స్సమస్య ఉంది. ఇవి పరిష్కారమయ్యాక, వాటర్బెల్ గురించి ఆలోచిస్తాం. ఇప్పటికి ప్పుడు సాధ్యం కాదు. ప్రస్తుత టైం టేబుల్మార్చాలి. కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు. భవిష్యత్లో ప్రయత్నిస్తాం” – స్కూల్ఎడ్యుకేషన్ఉన్నతాధికారి
ఇన్ఫెక్షన్స్ వస్తాయి
శరీరంలో ప్రతి జీవక్రియకూ వాటర్ చాలా అవసరం. ఒంట్లో వేడిని కంట్రోల్ చేయ డం, మలినాలను తొలగించడంలో వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. బాలికల్లో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. – విజయేందర్, డాక్టర్

