సాంకేతిక పరిఙానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఆ సాంకేతికతే మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతోంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా అవయవాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. వీటిల్లో ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ల్యాప్ట్యాప్లు, స్మార్ట్ టీవీలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని వాడుతున్నప్పుడు వాటి డిస్ప్లే ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. తద్వారా వెంటనే కాకపోయినా దీర్ఘకాలంలో ఈ పరిణామాలు కంటిని తీవ్రంగా నష్టపరుస్తాయి. తద్వారా కంటి చూపు మందగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పిల్లలు సాధారణంగా నిమిషానికి18 నుంచి 22 సార్లు కను రెప్పలు వేస్తారు. అలాంటిది స్మార్ట్ స్ర్కీన్స్ చూస్తున్నప్పుడు 50 శాతం తక్కువ రెప్పలు వేస్తున్నారు. పెద్దల్లో సైతం ఇలాంటి సమస్య ఉందని నివేదిక వెల్లడించింది. అయితే మొబైల్స్ నిత్యవసరమైన ఈ రోజుల్లో వాటిని మినహాయించడమనేది కష్టమే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. మరి కంటి చూపును మెరుగు పరుచుకోవడమెలాగో చూద్దాం...
- ఉదయం, సాయంత్రం 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి.
- టీ స్పూన్ మహాత్రిఫలాఘృత ని పాలతో కలిపి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు తీసుకోండి.
- అలోవెరా, ఉసిరికాయ రసాన్ని తాగితే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
- త్రిఫల, రోజ్వాటర్తో కళ్లను వాష్ చేయాలి.
ఏం తినాలి...
- ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు
- నీటిలో నానబెట్టిన 8 బాదంపప్పులు
- క్యారెట్, పాలకూర, బ్రోకలీ, చిలగడదుంప, స్ట్రాబెర్రీ
ఇవి తింటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.