ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై స్పందించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ అదానీ పేరును తీసుకోవడం లేదని ఈరోజు నరేంద్ర మోదీ అన్నారని నిజం ఏమిటంటే- రాహుల్ గాంధీ ప్రతిరోజూ అదానీ గురించి మాట్లాడతారని అతను ప్రతిరోజూ అదానీ గురించి నిజాలను బయటపెడుతాడని చెప్పారు. ప్రధానమంత్రికి పెద్ద పారిశ్రామికవేత్తల మధ్య "బంధం" గురించి రాహుల్ గాంధీ ప్రతిరోజూ ప్రజలకు చెబుతాన్నారని తెలిపారు.
నరేంద్ర మోదీకి బడా పారిశ్రామిక వేత్తలతో సంబంధాలు ఉన్నాయని తన స్నేహితులకు రూ. 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని చెప్పారు. కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, దీనికి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలపై గొంతెత్తాలని సూచించారు. మోదీ ఇలాంటి పనికిమాలిన అంశాలపై విరుచుకుపడే బదులు నిరుద్యోగం, ధరల మంట, మహిళలపై వేధింపులపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ.