బై పోల్లో అనుబంధ సంఘాల పాత్ర కీలకం

బై పోల్లో అనుబంధ సంఘాల పాత్ర కీలకం

కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  పార్టీలోని ప్రతి ఒక్కరు మునుగోడు ఉప ఎన్నికలో పని చేసి కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు.  ‘‘కాంగ్రెస్ పార్టీ కి ఈ ఎన్నికలు చాలా కీలకం. కార్యకర్తలు, నాయకులు పూర్తి స్థాయి లో కష్టపడి బీజేపీ,టీ ఆర్ఎస్ లకు బుద్ధి చెప్పాలి’’ అని పేర్కొన్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన అనుబంధ సంఘాల చైర్మన్ల సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమైందన్నారు. అనుబంధ సంఘాల చైర్మన్లు పట్టుదలతో మునుగోడు ఎన్నికలలో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.