సీఎంతో చర్చించాకే డాక్టర్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తాం

సీఎంతో చర్చించాకే డాక్టర్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తాం

హైదరాబాద్ బీఆర్ కే భవన్ లో ప్రభుత్వ డాక్టర్ల సంఘంతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బందికి ఎక్స్ గ్రేషియాపై సమావేశంలో చర్చించారు. సీఎంతో చర్చించాక  25లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామన్నారు ఈటల రాజేందర్ .మంత్రి  నిర్ణయంతో కొంత సంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ల సంఘం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో  ప్రభుత్వ డాక్టర్ల సంఘం లీగల్ ప్రెసిడెంట్ డాక్టర్ పల్లం ప్రవీణ్,  అధ్యక్షుడు లాలూ ప్రసాద్ రాథోడ్, గాంధీ యూనిట్ కార్యదర్శి రంగ, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.