ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : నిరంజన్

ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : నిరంజన్

 హైదరాబాద్, వెలుగు: జగిత్యాల సభలో ప్రధాని నరేంద్ర మోదీ మత పరమైన అంశాలు మాట్లాడారని, ఇది ఎన్నికల కోడ్‌‌కు విరుద్ధమని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీ భవన్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ముంబైలో చేసిన వ్యాఖ్యలను మోదీ వక్రీకరించారని, జగిత్యాల సభలో ప్రధాని అబద్ధాలు చెప్పారన్నారు.

 ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు  చేస్తామని నిరంజన్ స్పష్టం చేశారు.  కోడ్ అమల్లో ఉన్న సమయంలో మతపరమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన 'శక్తి' అనే పదాన్ని ప్రధాని మోదీ వక్రీకరించి, మత పరంగా రెచ్చగొట్టారన్నారు.