రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం

రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం

రాష్ట్రంలో ఈరోజు(జూన్ 16), రేపు(జూన్17) భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ వైపు వడగాలులు మరోవైపు వర్షం పడుతుందని తెలిపింది. ఏడు జిల్లాల్లో తీవ్రమైన వడగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొమురం భీమ్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అటు నిర్మల్, అదిలాబాద్, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.  ప్రజలంతా జూన్​ 16, 17 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించింది.