కరుణానిధి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

కరుణానిధి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి విగ్రహాన్ని కోడంబాక్కంలో ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. దాదాపు 15 అడుగుల ఎత్తులో కింద కూర్చొని ఉన్న కరుణానిధి విగ్రహాం.. పుస్తకం మీద ఏదో రాస్తున్నట్టుగా ఉంది. కరుణానిధి రచయిత అని తెలియజేశేలా ఆయన కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహావిష్కరణకు కరుణానిధి అభిమానులు, డీఎంకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.