ఇండియా, కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు

ఇండియా, కెనడా మధ్య ఖలిస్తానీ చిచ్చు
  • హర్దీప్​సింగ్ నిజ్జర్ హత్యలో ఇండియా హస్తం ఉందన్న ట్రూడో
  • కెనడాలోని మన అధికారిపై బహిష్కరణ వేటు
  • ట్రూడోకు షాక్ ఇచ్చిన ఇండియా
  • ఢిల్లీలోని కెనడా హై కమిషనర్​కు సమన్లు
  • ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం

టొరంటో/న్యూఢిల్లీ : ఇండియా, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. తమ తమ దేశాల్లోని డిప్లొమాట్స్​ను బహిష్కరించే దాకా పరిస్థితి వెళ్లింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియా ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్​లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కెనడాలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్​మెంట్ చీఫ్ పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బహిష్కరిస్తూ అక్కడి విదేశాంగ మంత్రి మెలనీ జాలీ నోట్ రిలీజ్ చేశారు. జస్టిన్ ట్రూడో కామెంట్లను ఇండియా ఖండిస్తూనే.. కెనడాకు ధీటుగా జవాబిచ్చింది. ఢిల్లీలోని కెనడా హై కమిషనర్ కామెరూన్ మెక్​కేను ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్​కు పిలిపించుకుంది. సమన్లు చేతిలో పెట్టి.. ఐదు రోజుల్లో ఇండియా విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కామెరూన్.. మీడియాతో మాట్లాడకుండా.. మైక్​లు తోసుకుంటూ కారెక్కి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జస్టిన్ ట్రూడో ఆరోపణలేంటి?

కెనడా పౌరసత్వం ఉన్న కేటీఎఫ్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియన్ ఎంబసీలోని ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్​లో ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. ‘‘ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్లకు, నిజ్జర్ హత్యకు లింక్ ఉన్నట్లు కెనడా సెక్యూరిటీ ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టమైంది.

Also Raed : తెలంగాణ సబ్బండ వర్గాలకు..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ‘గ్యారంటీ’ : బోరెడ్డి అయోధ్య రెడ్డి

ఇది మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే అవుతుంది. స్వేచ్ఛా, బహిరంగ, డెమొక్రటిక్ సొసైటీలకు, ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధం. హత్యకు సంబంధించిన దర్యాప్తుకు ఇండియన్ గవర్నమెంట్ సహకరించాలి. ఈ విషయాన్ని జీ20 సమిట్​కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాను”అంటూ కెనడా ప్రధాని ట్రూడో విమర్శించారు.

ట్రూడో కామెంట్లపై ఇండియా ఏమన్నది?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన కామెంట్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్​ హత్యలో ఇండియన్ ఏజెంట్ల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన కామెంట్లు అసంబద్ధం, ప్రేరేపితమైనవి అని విమర్శించింది. కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనలకు ఇండియాతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ‘‘కెనడాలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్​మెంట్ చీఫ్ పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బహిష్కరించడం దారుణం. అందుకే మేము ఇక్కడి కెనడా హైకమిషనర్​ను బహిష్కరించాం. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించాం. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతనికి కెనడాలో షెల్టర్ ఇవ్వడం సరికాదు. ఖలిస్తానీ టెర్రరిస్ట్​లపై నుంచి మా దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి కామెంట్లు చేస్తున్నది”అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎవరీ నిజ్జర్..?

జలంధర్​లోని భర్​సింగ్​పురాకు చెందిన నిజ్జర్.. 1997లో పంజాబ్ నుంచి కెనడా వెళ్లిపోయాడు. అక్కడ ప్లంబర్ పని చేసుకుంటూ కడుపు నింపుకునేవాడు.  భారత్ లో తనకు ప్రాణహాని ఉందంటూ శరణార్థిగా ఆశ్రయం కోరగా కెనడా ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో పౌరసత్వం కోసం కెనడా యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, అంతకు రెండేళ్ల ముందు సదరు యువతి మరో యువకుడికి ఇదే పద్ధతిలో కెనడా పౌరసత్వం ఇప్పించడంతో నిజ్జర్ దరఖాస్తును ఇమిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత కొంతకాలానికే నిజ్జర్ తాను కెనడా పౌరుడినని చెప్పుకున్నాడు. మారుపేరుతో, ఫేక్ వీసాతో కెనడాలోకి ఎంటరైన నిజ్జర్‌‌‌‌‌‌‌‌ కు కెనడా పౌరసత్వం లభించడం ఇప్పటికీ మిస్టరీనే! 2020లో నిజ్జర్‌‌‌‌ను టెర్రరిస్ట్​గా ఇండియా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కేటీఎఫ్ కోసం యువకులను రిక్రూట్ చేసుకుని నిజ్జర్ వారికి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సిఖ్స్ ఫ‌‌‌‌ర్ జ‌‌‌‌స్టిస్ (ఎస్ఎఫ్​జే) అనే వేర్పాటువాద గ్రూపును కూడా నిజ్జర్ న‌‌‌‌డిపాడు.  నిజ్జర్​కు టెర్రరిస్ట్​లతో కూడా సంబంధాలు ఉన్నట్లు గ‌‌‌‌తంలో ఎన్నోసార్లు కెన‌‌‌‌డాకు ఇండియా సూచించింది.  2007లో లూథియానాలో జరిగిన పేలుళ్ల కేసుతో పాటు నిజ్జర్ చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్​గా ఉన్నాడు. 2015లో లుకౌట్ నోటీసులు, 2016లో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2022 జూలైలో ఎన్ఐఏ నిజ్జర్ తలపై రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.