షారూఖ్ జవాన్ పార్టీకి నయనతార ఎందుకు హాజరుకాలేదు?

షారూఖ్ జవాన్ పార్టీకి నయనతార ఎందుకు హాజరుకాలేదు?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) డ్యూయల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కించిన ఈ యాక్షన్ ప్యాకుడ్ సినిమాలో.. నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 7న విడుదలై ఈ సినిమాకు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను చేసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. కేవలం వారంరోజుల్లోనే ఈ సినిమా రూ.700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ALSO READ: షారుఖ్కు ఘాటు ముద్దుపెట్టిన దీపిక.. స్పందించిన భర్త రణ్బీర్
 

ఇందులో భాగంగా తాజాగా జవాన్ మంచి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు మేకర్స్. ఈ కార్యక్రమానికి జవాన్ హీరో షారుక్, హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హాజరయ్యారు. అయితే జవాన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు నయనతార రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దానిపై సోషల్ మీడియాలో కూడా చాలా రకాల కామెంట్స్ కూడా వినిపించాయి. 

అయితే కార్యక్రమం మధ్యలో వీడియో రూపంలో తాను ఎందుకు రాలేకపోయిందో వివరించారు నయనతార. జవాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు రాకపోవడం పట్ల నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. నా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ నేను రాకపోవడానికి ఒక బలమైన  కారణం ఉంది. ఈ రోజు మా ఫ్యమిలీలో చాలా స్పెషల్ రోజు అందుకే రాలేకపోతున్నారు అని చెప్పుకొచ్చారు నయనతార. కానీ ఆ స్పెషన్ డే ఏంటనేది మాత్రం చెప్పలేదు నయనతార. ఆ తరువాత మైక్ తీసుకున్న షారుఖ్.. ఈరోజు నయనతార వాళ్ల అమ్మగారి పుట్టినరోజు అని , అది తనకెంతో స్పెషల్ అని చెప్పుకొచ్చారు. దీంతో నయనతార ఆ కార్యక్రమానికి రాకపోవడంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)