పొరుగూళ్లో పనిచేస్తున్న భర్త తనను తీసుకెళ్లలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. డాన్పూర్కు చెందిన వికాస్ బింద్కు మూడేళ్ల క్రితం సరస్వతి దేవితో వివాహం జరిగింది. వృత్తిరీత్యా వికాస్ సూరత్లో పనిచేస్తున్నాడు. అయితే లాక్డౌన్ సమయంలో పనిలేకపోవడంతో తిరిగి డాన్పూర్కు వచ్చాడు. కరోనా తీవ్రత తగ్గడంతో వికాస్ మళ్లీ సూరత్ వెళ్లి పనిచేస్తున్నాడు. భార్యను మాత్రం సొంతూళ్లోనే ఉంచాడు. అక్కడే ఉండి రెండున్నరేళ్ల బిడ్డను చూసుకోవాలని చెప్పాడు. కానీ సరస్వతికి మాత్రం భర్తతో పాటు సూరత్లో ఉండాలని ఉంది. కానీ అందుకు వికాస్ ఒప్పుకోలేదు. మనస్థాపం చెందిన సరస్వతి.. వికాస్ సూరత్కు వెళ్లిన తర్వాత సింధూరం తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. సింధూరంలో పాదరసం ఎక్కువగా ఉండడంతో అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. సరస్వతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించామని సూర్యవ పోలీస్ స్టేషన్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే.. ఆమె ఎంత మోతాదులో సింధూరం తిన్నదో తెలుస్తుందని ఆయన అన్నారు.
For More News..