సుపారీ ఇచ్చి భర్తను చంపించింది

సుపారీ ఇచ్చి భర్తను చంపించింది

మంచిర్యాల(లక్సెట్టిపేట), వెలుగు: మంచిర్యాల జిల్లాలో వేధింపులు తట్టుకోలేక సుపారీ ఇచ్చి భర్తను చంపించిందో భార్య. 16 నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల ఏసీపీ అఖిల్​మహాజన్ మంగళవారం లక్సెట్టిపేట పీఎస్ లో ప్రెస్​మీట్​పెట్టి వివరాలు వెల్లడించారు. లక్సెట్టిపేటకు చెందిన రసమల్ల శైలజ, గోదావరిఖనికి చెందిన రవికుమార్ ప్రేమించుకుని 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు పుట్టింది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. డైవర్స్​తీసుకున్న నెలలోనే మళ్లీ కలిసి పోయారు. కొన్నాళ్లకే మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేకపోయిన శైలజ.. భర్త రవికుమార్​ని చంపాలని స్కెచ్​వేసింది. గంగరాజు, సాయికుమార్ అనే ఇద్దరికి రూ.లక్ష సుపారీ ఇచ్చింది. 2020జూన్ 2న గంగరాజు రవికుమార్​ను మద్యం తాగుదామని ఇటిక్యాల చెరువు వద్దకు తీసుకెళ్లాడు. మొదట బీర్ సీసా, బండరాయితో రవిని కొట్టి చంపారు. తర్వాత చెరువు పొదల్లో పడేశారు. రవికుమార్ ​కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకపోవడంతో అదే ఏడాది డిసెంబర్​లో అతని చెల్లి దివ్య పోలీసులకు కంప్లైంట్ ​చేసింది. శైలజను అడగగా రవి జగిత్యాల, వరంగల్​లో ఉన్నాడని చెబుతూ నమ్మించింది. కొన్నాళ్లకు దివ్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు శైలజపై అనుమానం రావడంతో మళ్లీ ఫిర్యాదు చేశారు. విచా రణలో భార్యే భర్తను చంపించినట్లు తెలిసింది. శైలజ, సాయికుమార్‌‌‌‌ను  పోలీసులు రిమాండ్​కు తరలించారు. గంగరాజు పరారీలో ఉన్నాడు.