మంచిర్యాల(లక్సెట్టిపేట), వెలుగు: మంచిర్యాల జిల్లాలో వేధింపులు తట్టుకోలేక సుపారీ ఇచ్చి భర్తను చంపించిందో భార్య. 16 నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల ఏసీపీ అఖిల్మహాజన్ మంగళవారం లక్సెట్టిపేట పీఎస్ లో ప్రెస్మీట్పెట్టి వివరాలు వెల్లడించారు. లక్సెట్టిపేటకు చెందిన రసమల్ల శైలజ, గోదావరిఖనికి చెందిన రవికుమార్ ప్రేమించుకుని 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు పుట్టింది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. డైవర్స్తీసుకున్న నెలలోనే మళ్లీ కలిసి పోయారు. కొన్నాళ్లకే మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేకపోయిన శైలజ.. భర్త రవికుమార్ని చంపాలని స్కెచ్వేసింది. గంగరాజు, సాయికుమార్ అనే ఇద్దరికి రూ.లక్ష సుపారీ ఇచ్చింది. 2020జూన్ 2న గంగరాజు రవికుమార్ను మద్యం తాగుదామని ఇటిక్యాల చెరువు వద్దకు తీసుకెళ్లాడు. మొదట బీర్ సీసా, బండరాయితో రవిని కొట్టి చంపారు. తర్వాత చెరువు పొదల్లో పడేశారు. రవికుమార్ కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకపోవడంతో అదే ఏడాది డిసెంబర్లో అతని చెల్లి దివ్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. శైలజను అడగగా రవి జగిత్యాల, వరంగల్లో ఉన్నాడని చెబుతూ నమ్మించింది. కొన్నాళ్లకు దివ్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు శైలజపై అనుమానం రావడంతో మళ్లీ ఫిర్యాదు చేశారు. విచా రణలో భార్యే భర్తను చంపించినట్లు తెలిసింది. శైలజ, సాయికుమార్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. గంగరాజు పరారీలో ఉన్నాడు.
సుపారీ ఇచ్చి భర్తను చంపించింది
- తెలంగాణం
- October 13, 2021
లేటెస్ట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CMSS లో పోస్టులు భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం
- ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..