ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండు

ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండు
  • భర్తకు లెటర్​ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య 

మల్కాజిగిరి, వెలుగు: ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండమని ఓ గృహిణి లెటర్​ రాసి ఇంట్లోంచి  వెళ్లిపోయింది.  మల్కాజిగిరి  పరిధి ఆర్​కే నగర్​లో ఉండే జాడె రాకేశ్,​ కవిత (36)లు13 ఏండ్ల కిందట లవ్​ మ్యారేజ్ ​చేసుకోగా వారికి పిల్లలు కలగట్లేదు. దీంతో కొన్నేండ్లుగా హాస్పటళ్లలో  చూపించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు రాకేశ్​ తన మెడికల్​ షాప్​కి వెళ్లి రాత్రి 10:40కి ఇంటి రాగా తాళం వేసి ఉంది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయలేదు. చుట్టుపక్కల వారిని అడగడంతో పాటు స్థానికంగా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. కవిత ఫోన్​ అక్కడే ఉంది. ‘‘ ఇక నేను హాస్పిటల్​కి రాను.. ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా.. ఇది నా సొం త నిర్ణయమం..” అంటూ భార్య  లెటర్ రాసి టీవి పక్కన పెట్టింది చదివాడు. వెంటనే రాకేశ్ ​మల్కాజిగిరి  పోలీసులకు కంప్లయింట్​ చేయగా మిస్సింగ్​ కేసు ఫైల్​ చేశామని ఎస్​ఐ హరి ప్రసాద్​ తెలిపారు.