- భర్తకు లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య
మల్కాజిగిరి, వెలుగు: ఇంకో పెండ్లి చేసుకుని సుఖంగా ఉండమని ఓ గృహిణి లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. మల్కాజిగిరి పరిధి ఆర్కే నగర్లో ఉండే జాడె రాకేశ్, కవిత (36)లు13 ఏండ్ల కిందట లవ్ మ్యారేజ్ చేసుకోగా వారికి పిల్లలు కలగట్లేదు. దీంతో కొన్నేండ్లుగా హాస్పటళ్లలో చూపించుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు రాకేశ్ తన మెడికల్ షాప్కి వెళ్లి రాత్రి 10:40కి ఇంటి రాగా తాళం వేసి ఉంది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చుట్టుపక్కల వారిని అడగడంతో పాటు స్థానికంగా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. కవిత ఫోన్ అక్కడే ఉంది. ‘‘ ఇక నేను హాస్పిటల్కి రాను.. ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా.. ఇది నా సొం త నిర్ణయమం..” అంటూ భార్య లెటర్ రాసి టీవి పక్కన పెట్టింది చదివాడు. వెంటనే రాకేశ్ మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేయగా మిస్సింగ్ కేసు ఫైల్ చేశామని ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపారు.