
మే 4 నుంచి ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది సంస్థ యాజమాన్యం. మొదటగా డొమెస్టిక్ ఫ్లైట్స్ను నడుపుతామని మంగళవారం చెప్పింది. మే 3 వరకు లాక్ డౌన్ పూర్తవుతుంది కావున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇండిగో సీఈఓ రొనొజోయ్ దత్తా చెప్పారు.
సామాజిక దూరం పాటించడంతో పాటు తమ ప్రయాణికుల, ఉద్యోగుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నామని దత్తా తెలిపారు. మే 3 తర్వాత దేశీయ, విదేశీయ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తుందని తాము నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.
మే3 తర్వాత విమానప్రయాణాలను అనుమతించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ట్వీట్ చేశారు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. అయితే తాము విమానయాన సంస్థల సమస్యలను అర్థం చేసుకోగలమని చెప్పారు.