
ఈ యేడు ఇప్పటికే బంగార్రాజు, థాంక్యూ, లాల్సింగ్ చద్ధా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్య.. నెక్స్ట్ సినిమాని కూడా ఆమధ్య అనౌన్స్ చేసేశాడు. ఇది తనకి ఇరవై రెండో సినిమా. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ని నిన్న తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఇచ్చాడు చైతు. ఇవాళ్టి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారనేదే ఆ అప్డేట్. ‘ఏఎన్నాఆర్ గారి దివ్య ఆశీస్సులతో మా ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నాం.. యాక్షన్ బిగిన్స్’ అన్నారు చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించనుండడంతో ఆసక్తి నెలకొంది. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు. రీసెంట్గా ‘మానాడు’తో మంచి విజయాన్నే అందుకున్నాడు వెంకట్ ప్రభు. మరి చైతు కోసం ఎలాంటి కథ రాశాడో, అతనిని ఎలా చూపించబోతున్నాడో చూడాలి!