ఉపవాసం ఉన్నప్పుడు అన్నిరకాల ఫుడ్ తినరు. దాంతో శరీరానికి సరిపోను పోషకాలు అందవు. శక్తి తగ్గిపోయి నీరసం వస్తుంది. అందుకని తినే ఫుడ్లో హెల్దీ ఫ్యాట్స్, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దాంతో శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్తోంది న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.
- బ్రేక్ఫాస్ట్గా సాబుదానా కిచిడీ తినాలి. గెనుసు గడ్డ (రత్నపురి, మొరంగడ్డ), పెరుగు కలిపి తినొచ్చు. ఆలుగడ్డతో ఖీర్, పూరీలతో పాటు శనగల కర్రీ తిన్నా హెల్దీనే.
- వీటితోపాటు అన్నిరకాల పండ్లు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి తినాలి. ఏడెనిమిది కిస్మిస్లు, రెండు కుంకుమ పువ్వుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే వెంటనే శక్తి వస్తుంది.
- మధ్యాహ్న భోజనంలో జొన్న రొట్టె, తామర గింజల కూర తినొచ్చు. రాత్రి భోజనంలో అన్నంలోకి పప్పు లేదా పనీర్ కర్రీ చేసుకోవచ్చు.