జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు

డిచ్​పల్లి, వెలుగు : మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ లో సత్తా చాటారు. ఈ గురుకులం నుంచి ఏకంగా 15 మంది విద్యార్థులు అడ్వాన్స్​కి అర్హత సాధించారు.  కాలేజీ నుంచి మంచి పర్సంటైల్‌తో

స్టూడెంట్ అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్​ సంగీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  వీరిలో అత్యధిక పర్సంటైల్​ వర్ష 92.44, తేజశ్రీ 90.87, కృతగ్న 86.76, సంధ్య 85.71, అపూర్వ 79.46 లు సాధించినట్లు పేర్కొన్నారు.