బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్

బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్/ రాయికల్, వెలుగు:  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలోని మోతే పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. గులాబీ కార్యకర్తలు బాజిరెడ్డి గోవర్ధన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.  రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలో గాంధీచౌక్​ నుంచి అంగడిబజార్​ (పాత బస్టాండ్) వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారులను కలిసి ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్​పర్శన్​ దావ వసంత, పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వైస్ చైర్మన్ శ్రీనివాస్, రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ సంధ్యారాణి, మున్సిపల్​చైర్మన్​ హన్మండ్లు, వైస్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమాదేవి, లీడర్లు బాపురెడ్డి, శ్రీధర్​రెడ్డి పాల్గొన్నారు.