డయాలసిస్ చేస్తూ మధ్యలో ఆపేశారు..కలెక్టర్ గారూ నన్ను రక్షించండి!

డయాలసిస్ చేస్తూ మధ్యలో ఆపేశారు..కలెక్టర్ గారూ నన్ను రక్షించండి!

డయాలసిస్ చేయించాలంటూ.. ఖమ్మం కలెక్టర్ కు లేఖ రాసింది వెంకటరత్నం అనే మహిళ. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద కొన్నాళ్లు ట్రీట్ మెంట్ చేసి మధ్యలో ఆపేశారని గ్రీవెన్స్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. డబ్బులిస్తేనే వైద్య చేస్తామంటున్నారని.. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే సరైన రెస్పాన్స్ లేదని గోడు వెళ్లబోసుకుంది వేసుకుంట్ల గ్రామానికి చెందిన వెంకటరత్నం. ఆరోగ్య శ్రీ కింద తనకు క్రమం తప్పకుండా డయాలసిస్ చేసేలా ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు మొర పెట్టుకుంది మహిళ.