లండన్: రెండేళ్లుగా ఊరిస్తున్న మహిళల సింగిల్స్ అత్యధిక టైటిళ్ల రికార్డును సాధించాలనే లక్ష్యంతో అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ శనివారం వింబుల్డన్ఫైనల్లో బరిలోకి దిగుతోంది. తుది పోరులో ప్రపంచ మాజీ నం.1, సిమోనా హలెప్ (రొమేనియా)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే ఓపెన్ ఎరాలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) రికార్డును సెరెనా సమం చేస్తుంది. ప్రస్తుతం 23 టైటిళ్లతో కొనసాగుతున్న అమెరికన్.. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరినా టైటిల్స్ను గెలవలేకపోయింది. ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్న సెరెనా.. ఫైనల్కు చేరే క్రమంలో నలుగురు సీడెడ్ప్లేయర్లను ఓడించింది. హలెప్తో ముఖాముఖి పోరులోనూ 9–2తో ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి 24వ టైటిల్ నెగ్గాలని భావిస్తోంది.