
పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేసిన మహిళను అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్పల్లిలో ఉండే యూనిస్లాల్నున్మావిచౌగ్నత్తు(35) అనే మహిళ సోమవారం మల్లాపూర్వద్ద అయాన్డిజిటల్జోన్లో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చింది. తనను లోపలికి పంపాలని సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. డ్యూటీలో ఉన్న నాచారం పోలిస్టేష్ కానిస్టేబుల్ జి.రమేష్అది గమనించి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. నేను ఎవరనుకుంటున్నావు మేఘాలయలో డీజీగా పనిచేసి రిటైర్ట్అయిన దొతాంగ కూతురునని కానిస్టేబుల్పై దాడిచేసి అతని చేతిలో ఉన్న టాబ్ని కింద పడేసింది. కానిస్టేబుల్ రమేష్ అధికారులకు సమాచారం ఇచ్చి మహిళపై కంప్లయింట్ చేశాడు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో ఆమెపై నగరంలోని పలు పోలీస్టేషన్లలో సుమారు 25 కేసుల వరకు ఉన్నాయని తెలుసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని నాచారం ఎస్ఐ తెలిపారు.