
- ఇండ్లు ఉన్నొళ్లకే మళ్లీ ఇచ్చారని ఆందోళన
జమ్మికుంట, వెలుగు: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా అనర్హులకు కేటాయించారంటూ జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ పేరుతో గతంలో ఇల్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపించారు.
నిరుపేదలకు ఇండ్లు కేటాయించడంలో అధికారులు విఫలమయ్యారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శిని నిలదీశారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు ఆందోళనలో విరమింపజేశారు.