రాఖీ పౌర్ణమి రోజు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ

రాఖీ పౌర్ణమి రోజు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఆ రోజు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లోనూ, సిటీ బస్సుల్లోనూ ఆగస్టు 14వ తేదీ అర్థ రాత్రి నుంచి 15వ తేదీ అర్థ రాత్రి వరకూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఇందులో భాగంగానే మహిళలకు తగిన భద్రత కల్పిస్తామని తెలిపింది యూపీ ప్రభుత్వం.