నాచారం, వెలుగు: డిమాండ్లు పరిష్కరించాలని నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ యూనిట్ ఎదుట సోమవారం వెయ్యి మంది మహిళలు ధర్నాకు దిగారు. పరిశ్రమలో పని చేస్తున్న తమపై వేధింపులను అరికట్టాలని, కనీస వేతనం రూ.15 వేలు అమలు చేయాలని, ఓటీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
సోమవారం మేనేజ్మెంట్తో చర్చలు విఫలం కావడంతో మంగళవారం కూడా ధర్నా కొనసాగించారు. ప్రజా గాయకురాలు విమలక్క, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, ఏఐటీయూసీ నాయకుడు సత్యప్రసాద్ సంఘీభావం తెలిపారు.

