హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఘటన బాధాకరమని కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ప్రెస్నోట్ రిలీజ్ చేసిన ఆమె సంఘటనపై తక్షణమే విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా విమెన్ కమిషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో కట్టెల కోసం వెళ్లిన ముగ్గురు ఆదివాసీలను ఫారెస్ట్ గార్డులు తరిమిన సంగతి తెలిసిందే. ఓ బాలింత ఉరుకుతూ గొయ్యిలో పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆందోళనలు చేసిన
సంగతి తెలిసిందే.