లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ కమిషనర్

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన భైంసా మున్సిపల్ కమిషనర్

నిర్మల్:భైంసాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు.  ఓ ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. భైంసా మున్సిపల్ కార్యా లయంలో బుధవారం (మే 22) ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

భైంసా పట్టణ పరిధిలో పురానం బజార్ కు చెందిన రాదేశం అనే వ్యక్తి  ఇంటి నిర్మాణానికి అనుమతుల ఇచ్చేందుకు వెంకటేశ్వరు లంచం డిమాండ్ చేశారు. బాధితు డిని డబ్బులు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అధికా రులు లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు.