
బంపర్ మోజార్టీతో లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
అనంతరం రాజ్యసభలో డిజిటైల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. 171 మంది సభ్యలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. రాజ్యసభలో ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఉభయసభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావడంతో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్సభలో అర్జున్రాం మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. 20న చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా లోక్సభలో 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు.