ధోనీ రక్తం కక్కుకున్నాడా..?

ధోనీ రక్తం కక్కుకున్నాడా..?

మహేంద్రసింగ్ ధోనీ.. వరల్డ్ కప్ సమరంలో ఈ టీమిండియా మాజీ కెప్టెన్ పై పెద్దస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారీ షాట్లు కొట్టలేక మ్యాచ్ ను చేజార్చాడనీ… బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌండరీలు కొట్టలేక స్కోరు వేగం పెంచలేకపోయాడని ఈ ధనాధన్ ప్లేయర్ పై విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. బెస్ట్ ఫినిషర్ కు ఏమైంది.. ఇలా ఆడుతున్నాడు.. రిటైర్మెంట్ టైమ్ వచ్చేసిందంటూ విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ఐతే.. ఇదే సందర్భంలో ధోనీ ఫొటో ఒకటి వైరల్ అయింది.

ధోనీకి ఏమైంది.. అతడు రక్తం ఎందుకు కక్కుకున్నాడు అనేదానిపై చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ కుడి చేతి బొటనవేలుకు గాయమైంది. ఆ వేలుకు రక్తం కారడంతో.. ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో తీసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. “బౌండరీలు కొట్టాల్సిన ధోనీ సింగిల్స్, డబుల్స్ తీశాడంటూ చాలామంది విమర్శిస్తున్నారు. వేలికి రక్తగాయం అయినా కూడా క్రీజులో ఆడాడు.. అదీ ధోనీ డెడికేషన్” అని మహి ఫ్యాన్స్ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.